Suriya: ఆ సమయంలో అండగా నిలిచిన ఫ్యాన్స్ ను కలిసిన సూర్య.. ఏమైందంటే?

  • March 4, 2024 / 05:18 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ గా మంచి గుర్తింపును కలిగి ఉన్న సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సూర్య ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే సూర్య తాజాగా చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

2023 సంవత్సరం డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు. తుఫాను తగ్గేవరకు ఆయా ప్రాంతాలలో అన్నదానంతో పాటు వైద్య సేవలు అందేలా చూశారు. సూర్య బ్రదర్స్ నుంచి ఏమీ ఆశించకుండా అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

ఆ సమయంలో సూర్య, కార్తీ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సూర్య అభిమానుల రుణాన్ని తీర్చుకోవాలని భావించి వాళ్ల కోసం విందు ఏర్పాటు చేయడంతో పాటు ఆయనే స్వయంగా వడ్డించారు. చెన్నైలోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో తన అభిమాన సంఘంలోని సభ్యులకు సూర్య విందును ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్స్ తో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సూర్య (Suriya) కంగువా సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి ప్రయోగాత్మక కథలకు ఎక్కువగా ఓటేస్తున్న సూర్య సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సూర్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus