Vidyullekha Raman: కన్నీళ్లు పెట్టుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్..!

  • April 7, 2021 / 06:39 PM IST

విద్యుల్లేఖ రామన్ ..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని హీరోగా గౌతమ్ మేనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ‘రన్ రాజా రన్’ ‘సరైనోడు’ ‘నిన్ను కోరి’ ‘రాజా ది గ్రేట్’ ‘తొలిప్రేమ’ ‘మహర్షి’ వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.విద్యుల్లేఖ.. ప్రముఖ తమిళ నటుడు మోహన్ రామన్ కుమార్తె అని బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.

లెజెండరీ డైరెక్టర్ కె.బాలచందర్ గారు ఇష్టపడే నటుల్లో మోహన్ రామన్ కూడా ఒకరు. ఆయన వారసురాలు కావడం వల్లనే విద్యుల్లేఖ అంత మంచి నటిగా గుర్తింపుని సంపాదించుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఇదివరకు కాస్త బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ .. ఈ మధ్య ఎన్నో కసరత్తులు చేసి సన్నబడింది.సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘పుడింగి నెంబర్.1’ చిత్రంలో ఈమె ఓ హీరోయిన్ గా కూడా నటిస్తుందట. ఈ విషయాన్ని ఆమెనే తెలియజేసింది. దాంతో సోషల్ మీడియాలో …

‘ఇక కమెడియన్ గా చెయ్యవా? హీరోయిన్ గానే కొనసాగుతావా ఏంటి?’ అంటూ విమర్శిస్తూ కామెంట్లు చేశారట నెటిజన్లు. ‘అధిక బరువు పెరిగిపోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, అందుకే ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడ్డాను అని.. అయినప్పటికీ ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ’ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. అయినప్పటికీ కామెడీతో కూడిన లీడ్ రోల్స్ వస్తే వదులుకోనని.. చెయ్యడానికి నేను ఎప్పుడూ రెడీ’ అంటూ చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus