ఇది సాహసమనే చెప్పాలి అమలా పాల్..!

  • April 5, 2019 / 05:16 PM IST

కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది అమలా పాల్. తెలుగులో కూడా ఈ అమ్మడు సుపరిచితమే. బెజవాడ,నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏ.ఎల్.విజయ్ ను పెళ్ళిచేసుకుని కాస్త సినిమాలు తగ్గించిందనే చెప్పాలి. తరువాత అమలా పాల్ కొన్ని కారణాల వలన తన భర్త విజయ్ తో విడిపోయింది. ఇక ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఎప్పటినుండో ఈ అమ్మడికి నిర్మాతగా మరలనేది కోరికట. ఎప్పటినుండో ఈ అవకోసం కోసం ఎదురు చూస్తుందట. ఫైనల్ గా ఇప్పుడు డ్రీమ్ ఆ అవకాశం వచ్చింది.

తాజాగా ఓ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తెచ్చిందట. సప్సెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా అనూప్ అనే కొత్త దర్శకుడు పరిచయమవ్వవుతున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని కేరళలో లాంచ్ చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ ఇప్పటి వరకూ చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎవరూ దీనిని పట్టించుకోలేదట. అయితే కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓకే చెప్పేసిందట అమలా పాల్. హీరోయిన్లు నిర్మాతగా మారడానికి పెద్దగా దైర్యం చెయ్యరు. కానీ అమలా పాల్ దైర్యంగా అటువైపు అడుగులువేస్తుంది. మరి తన తొలి ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus