తన పూర్వ వృత్తిని వదులుకోనన్న చైతూ హీరోయిన్!

  • March 7, 2018 / 03:46 PM IST

ఎంత ఎత్తుకు ఎదిగినా  .. ఆ స్థానానికి చేరుకోవడానికి ఉపయోగపడిన వృత్తిని గుర్తుంచుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ పనిని చేయడం మాత్రం వదులుకోనని చెప్పడం.. ఆ పనిపై ఉన్న ప్రేమను మనకి తెలియజేస్తుంది. హైదరాబాద్ లో పుట్టి.. బెంగళూర్ లో పెరిగిన నిధి అగర్వాల్‌ మొదట మోడలింగ్ చేసింది. పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. అందాల పోటీలో పాల్గొని బాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడింది. అక్కడే నటిగా అరంగ్రేటం చేసింది. మున్నా మైఖేల్ సినిమా హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో అవకాశం అందుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. మాధవన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇందులో నిధి అగర్వాల్‌ నటన సినిమాకి ప్లస్ అవుతుందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. తాజాగా నిధి ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు చెప్పింది. హీరోయిన్ గా బిజీ అయిపోతున్నారు.. ఇక మోడలింగ్ చెయ్యరా? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. “హీరోయిన్‌గా నేను ఎంత బిజీ అయినా మోడలింగ్‌ను మాత్రం వదలేదే లేదు. నా అందాన్ని అభిమానులకు పరిచయం చేసింది మోడలింగే. కాబట్టి సినిమాల తర్వాత  మోడలింగ్ కే ప్రయారిటీ ఇస్తాను” అని వెల్లడించింది. సినిమా అవకాశం రాగానే మోడలింగ్ ని వదిలేసిన  తారలు ఎంతోమంది ఉన్నారు. తొలిసారి మోడలింగ్ ని వదలని అని చెప్పిన నిధి.. మోడల్స్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus