‘మీ టూ’ అనుభవాలపైనా స్పదించిన పూజాహెగ్డే!

  • November 10, 2018 / 08:01 AM IST

ఒక లైలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరోయిన్ పూజాహెగ్డే. ఆ తరువాత ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ స్టార్ అయిపోయింది. ఇటీవలే విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘అరవింద సమేత’ సినిమా తో ఈ సెక్సీ భామ మరింత జోరు మీద ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్. ఇలా అగ్ర హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ కెరియర్ లో దూసుకుపోతున్న ఈ భామ ‘మీ టూ’ ఉద్యమం పైన స్పదించింది.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉద్యమం ‘మీ టూ’. ఇప్పటికే ‘మీ టూ’ అంటూ చాలమందికి వారికీ జరిగిన అన్యాయాల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. అయితే దీనిపైనా స్పదించిన పూజ హెగ్డే, అందరు ఎంతో డేరింగ్ గా ముందుకు వచ్చి వారి బాధలని చెప్పుకుంటుంటే కొందరు ఎపుడో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు చెప్పడం ఏంటని తప్పుగా మాట్లాడుతన్నారు, అన్యాయం ఎప్పుడు జరిగిన వారికీ జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిది, ప్రతి రంగంలో జరుగుతున్న ఈ వేధింపుల పైన ప్రభుత్వమే గట్టి నిర్ణయం తీసుకోవాలని, సినీ ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయని ఒక్కొక్కరు వారి అనుభవాలు చెబుతుంటే మతి పోతుందని వివరించింది.

ఇంకా మీకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని కొందరు అడుగుతున్నారు, నేను అయితే ఇప్పటివరకు ఎలాంటి వేధింపులకు గురి కాలేదు, ఇలా వేధింపులకు గురవుతున్న ఆడవారికి నావంతుగా చేతనైన సహాయం చేయడానికి నేను ఎప్పుడు రెడీ గా ఉంటానని పూజ హెగ్డే ‘మీ టూ’ ఉద్యమం పైన స్పదించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus