Pranitha: ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • September 20, 2024 / 01:35 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదం కొనసాగుతోందనే సంగతి తెలిసిందే. లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన ఒక సంస్థకు సంబంధించిన నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారని ఒక ల్యాబ్ నివేదిక ద్వారా వెల్లడి కావడం ఆ నివేదిక గురించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం ఒకింత సంచలనమైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ మాజీ ప్రధానార్చకులు సైతం గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిందని వెల్లడించారు.

Pranitha

ఈ ఘటన గురించి ప్రణీత (Pranitha Subhash) స్పందిస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం జంతువుల కొవ్వును వినియోగించడం మాహా దారుణం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధ్యుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని ప్రణీత అన్నారు. ఈ ఘటన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు కలలో సైతం ఊహించనిదని ప్రణీత తెలిపారు.

ప్రణీత ఈ ఘటన గురించి స్పందించిన తొలి సినీ సెలబ్రిటీ కాగా ఆమె రియాక్ట్ కావడంతో మరి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటన గురించి స్పందించే అవకాశం అయితే ఉంది. వైసీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని చెబుతుండటం కొసమెరుపు. ఈ వివాదం విషయంలో తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసిన అనుమానాల వల్ల ఈ వివాదం తలెత్తింది. హీరోయిన్ ప్రణీత స్పందనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రణీత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రణీత రాబోయే రోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మేకర్స్ షాకిచ్చారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus