ఉరేసుకునే ముందు రోజు.. ఆ యంగ్ హీరోయిన్ చేసిన పోస్ట్ వైరల్..!

మొన్నటికి మొన్న బాలీవుడ్ బుల్లితెర నటుడు మనమిత్ గ్రేవాల్ ప్రాణత్యాగం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు లేకపోవడంతో.. ఆయనకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయట. అందుకే ఇంత అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని నుండీ బాలీవుడ్ ప్రేక్షకులు కోలుకోకుండానే మరో ఘోరం జరిగింది. ఓ యువ హీరోయిన్ కూడా తాజాగా ఫ్యాన్ కు ఉరేసుకుని ఈ లోకానికి దూరం అయిపోయింది.ఆ యువ హీరోయిన్ మరెవరో కాదు ప్రేక్ష మెహతా.

ఈమె కూడా కావాలనే ప్రాణత్యాగం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈమె పలు టాప్ రేటింగ్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించిందట. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘ప్యాడ్ మెన్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. వరుసగా టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ .. ప్రేక్షకులను అలరించింది. ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈమె .. ఇండోర్ లో ఉంటున్న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలుస్తుంది.

దానికి ముందురోజు.. ఈమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ‘ఎప్పుడైతో నీ కలలు అనీ చెల్లా చెదురు అవుతాయో… అంతకంటే బాధాకరమైన విషయం జీవితంలో మరొకటి ఉండదు’ అంటూ పోస్ట్ చేసింది ప్రేక్ష మెహతా. అంతేకాదు ‘అగర్ తుమ్ సాత్ హో’ అంటూ దానికి క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ లు అవుతున్నాయి.ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి విషాద ఛాయలు నెలకొన్నాయి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags