Actress Tabu: ‘అల వైకుంఠపురములో’ రీమేక్.. హీరోని హెచ్చరించిన నటి!

  • December 21, 2021 / 05:46 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది టబు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఆమె నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెను సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కీలకపాత్రలో నటించింది.

ఈ సినిమాలో ఆమె సీరియస్ లుక్ తో కనిపిస్తుంటుంది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. బనీన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అయితే షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు రోహిత్ ధావన్ తో తీసుకున్న సెల్ఫీను కార్తిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోపై టబు స్పందించింది. ”అది నా సినిమా.. జాగ్రత్తగా రీమేక్ చేయండి” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇది చూసిన కార్తిక్ ఆర్యన్ ”మీ సినిమా కాబట్టే ఇంకా ఎక్కువ ప్రేమతో చేస్తున్నాం మేడమ్” అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సినిమాకి ‘షెహ్ జాదా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ కు జోడీగా కృతిసనన్ నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus