ఆసక్తి రేకెట్టిస్తున్న ‘శివాయ్’ పోస్టర్లు..!

  • May 23, 2016 / 07:04 AM IST

అజయ్ దేవగణ్  స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శివాయ్’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. ఈ చిత్ర పోస్టర్లు చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్ 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అజయ్ దేవగణ్ విడుదల చేసిన చిత్ర పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

మంచు కొండల మధ్య తాడుతో అజయ్ దేవగణ్ కిందకు వేలాడుతుండగా.. వెనుక హెలికాప్టర్, మంచు కొండల్లో శివుడి రూపం.. ఆ పక్కనే దుష్టశక్తులు ఉన్నట్లు రూపొందించిన ఈ పోస్టర్ చిత్రం పై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus