నాగార్జున, నాని సినిమా కథ ఒక జాన్రాలో ఉండదు : శ్రీరామ్ ఆదిత్య

  • March 8, 2018 / 09:47 AM IST

సినిమా పుట్టిన తర్వాత సినిమా గ్రామర్ పుట్టింది. అందుకే చిత్ర రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. సినిమా ప్రేక్షకుల అభిరుచులను అనుసరించి.కథ ఎవరికీ నచ్చుతుందో చెప్పడానికి సినిమాకి జాన్రా ని ఫిక్స్ చేశారు. ఇది హాలీవుడ్ వారు పక్కాగా ఫాలో అవుతూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేసరికి రెండు మూడు జాన్రాలు కలిపి కథ సిద్ధం చేస్తుంటారు. రీసెంట్ గా నాని నిర్మించిన “అ” సినిమా అయితే ప్రతి పది సినిమాలకు జాన్రా మారిపోతుంటుంది.

ఇక నాని కృష్ణార్జున యుద్ధం మూవీ తర్వాత చేయనున్న సినిమా కూడా అనేక ఎమోషన్ ల కలయిక అని డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పారు. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు నాని, నాగార్జునను కలిపి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ఈ చిత్రం ఒక జానర్లో ఉండదని తన గత సినిమాల్లానే పలు రకాల జానర్లలో ఉంటుందని అన్నారు. మరి ఈ సినిమా ఎంతమేర ప్రజలను మెప్పిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus