శృతిమించిన రొమాన్స్ కారణంగానే.. ఇలా జరిగిందా?

  • September 7, 2019 / 01:48 PM IST

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్3’ గత వారం వరకూ కాస్త నీరసంగా నడిచినట్టు అనిపించినా ఈ వారం మళ్ళీ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం గొడవలు, ఫన్, రొమాన్స్ తో మంచి కమర్షియల్ సినిమాలా సాగుతుంది. ఇక శుక్రవారం ఎపిసోడ్ లో కూడా ఫన్ తో పాటు ఏడుపులు కూడా చోటు చేసుకోవడంతో ప్రేక్షకులకి ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఇక ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు ఫన్ తో కూడిన ఆన్సర్స్ ఇవ్వాలి అనేది ఆ టాస్క్. ఎవరు ఎక్కువ ఫన్ ఇచ్చే సమాధానాలు చెబుతారో వాళ్ళే విజేతలన్న మాట.

ఇక ఈ టాస్క్ లో విజేతగా నిలిచిన వారు బిగ్ బాస్ ఇచ్చిన టీ షర్ట్ వేసుకోవాలి. అలాగే ఇంటిసభ్యులు ఆ రోజంతా నవ్వుతూనే మాట్లాడుతుండాలి. అయితే ఈ టాస్క్ లో మహేష్ విట్టా విజేతగా నిలిచాడు. ఇక ఈ టాస్క్ అయ్యాక హౌస్ మేట్స్ కు వారి కుటుంబ సభ్యులు ఇంటి నుండీ ఇష్టమైన ఫుడ్ అలాగే ఓ మెసేజ్ పంపించారు. ఇదే వరుసలో ఒక్కొక్కరు తమ ఇంటి వాళ్ళ నుండీ వచ్చిన మెసేజ్ చదువుతూ – ఏం ఫుడ్ పంపారో చదువుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలో అలీ ఇంటి నుండీ వచ్చిన మెసేజ్ చదివాడు. అలీ భార్య ప్రేమగా అన్ని చెప్పి చివరిలో ‘ఐ ట్రస్ట్ యూ’(నేను నిన్ను నమ్ముతున్నాను) అని పెట్టింది. దీంతో అలీ కొంచెం షాక్ కు గురయ్యాడు. దీనికి అసలు కారణం ఏంటంటే… ‘బిగ్ బాస్ సీజన్ 3’ మొదలైనప్పటి నుండీ అలీ – శ్రీముఖి లు చాలా క్లోజ్ గా ఉండడమే అని తెలుస్తుంది. ఓ టాస్క్ లో వీరి మధ్య రొమాన్స్ కాస్త శృతిమించిందనే చెప్పాలి. ఇందుకే అలీ భార్య అలా పెట్టిందని హౌస్ మేట్స్ కూడా అనుకుంటున్నారు. ఇక ఈ టాస్క్ అయిపోయాక శ్రీముఖి మూడీగా కూర్చుని ఉండటంతో అలీ – శివజ్యోతిలు మాట్లాడటానికి ఓదార్చడానికి ప్రయత్నించారు. ఈ తరుణంలో కొన్ని రోజులు నాతో మాట్లాడొద్దని శ్రీముఖి అలీకి చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus