అల్లరి నరేష్ సరసన “దృశ్యం” భామ!

  • June 7, 2016 / 01:32 PM IST

వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కిన “దృశ్యం” చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన కృతిక ప్రస్తుతం కథానాయికగా మంచి అవకాశాలు దక్కించుకొంటూ దూసుకుపోతోంది. “రోజులు మారాయి” చిత్రంలో ఒక కథానాయకిగా నటిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు మరో మంచి అవకాశం వచ్చింది.

అల్లరి నరేష్ కథానాయకుడిగా నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో బివిఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో కృతికను కథానాయికగా ఎంపిక చేశారని తెలుస్తోంది. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ సినిమా సెట్స్ కు ఎప్పుడు వెళ్తుందో తెలియాల్సి ఉంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus