Allu Aravind: అప్పుడు లావణ్య త్రిపాఠికి చెప్పిందే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి కూడా…!

  • October 31, 2023 / 04:12 PM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీవెనలకి ఒక మహత్యం ఉందేమో, అతను ఏమని దీవిస్తే అది అయిపొయింది. ఇంతకు ముందు ఒక సభలో నటి లావణ్య త్రిపాఠి ని ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే హైదరాబాదులో ఉండిపో అని ఆమెని దీవించారు. అంతే లావణ్య త్రిపాఠి, అల్లు అరవింద్ మేనల్లుడు అయిన వరుణ్ తేజ్ ని ప్రేమించి, రేపు నవంబర్ 1 వ తేదీన ఇటలీలో వివాహం చేసుకుంటోంది.

అదే అల్లు అరవింద్ ఇప్పుడు ఇంకో నటిని కూడా అలానే దీవించారు. సైమా 2023 అవార్డు ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠి ని ఎలా అయితే దీవించారో, అలానే మృణాల్ ఠాకూర్ ని కూడా దీవించారు. మృణాల్ ‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది, అందులో సీత పాత్రలో అందరినీ మెప్పించింది. సైమా 2023 లో సీత పాత్రకి గాను ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. ఈ అవార్డు అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకుంది మృణాల్ ఠాకూర్.

ఈ సందర్భంగా (Allu Aravind) అల్లు అరవింద్ మాట్లాడుతూ, “ఇంతకు ముందు ఒక హీరోయిన్ ని తెలుగు అబ్బాయిని పెళ్లిచేసుకొని తెలుగింటి కోడలిగా రమ్మని బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఆమె ఒక తెలుగు హీరోని ప్రేమించి, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఇప్పుడు నీకు కూడా అదే బ్లెస్సింగ్ ఇస్తున్నా, నువ్వు కూడా ఇక్కడికే వచ్చేయాలి,” అని చెప్పారు. ఈ వీడియో ఇప్ప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఉత్తమనటిగా ఇది తన మొదటి అవార్డు అని తెలుగు అమ్మాయిలా ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది, ముఖ్యంగా ‘సీతారామం’ చిత్ర యూనిట్ కి. అలాగే బాలీవుడ్ లో అందరూ నేను హైదరాబాదు షిఫ్ట్ అయ్యాను అని అనుకుంటున్నారు, తనకి కూడా హైదరాబాదు వదిలి వెళ్లాలని లేదు అని కూడా చెప్పింది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus