‘చెర్రీ’ పై అల్లు ఆరవింద్ కు ఎందుకంత కోపం???

  • January 18, 2017 / 11:51 AM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి వెన్ను ముఖ లాంటి వాడు నిర్మాత అల్లు ఆరవింద్….చిరు సుప్రీం హీరోగా ఉన్న సమయంలో ఆయన మెగాస్టార్ గా మారెందుకు చేసిన కృషిలోఅల్లు ఆరవింద్ హెల్ప్ చాలా ఉంది అనే చెప్పాలి….చిరుకే కాదు…సాక్షాత్తూ రామ్ చరన్ కరియర్ విషయంలో కూడా ‘మగధీర’ సినిమా తీసి చెర్రీ కరీర్లోనే టాప్ హిట్ గా నిలిపిన ఘనత అల్లు ఆరవింద్ కే చెందుతుంది…అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీకి అంతటి ముఖ్యమైన వ్యక్తికి చెర్రీపై కోపం వచ్చిందట…..ఇంతకీ ఎందుకు ఆ కోపం…అసలు ఏమయ్యింది అంటే….ఈ కధ చదవండి….ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగానే కాకుండా…నిర్మాతగానూ సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ మెగాహీరోల సొంత బ్యానర్ అంటే గీతా ఆర్ట్స్ అని మాత్రమే అందరికి తెలుసు..ఇక కొణిదెల ప్రొడక్షన్స్ నుండి వచ్చిన మొదటి మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’. రామ్‌ చరణ్‌ నిర్మాతగా చేసిన మొదటి చిత్రమే అయినప్పటికీ ఈ సినిమా దాదాపు 30 కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.

అలాగే ఇప్పుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మెగాస్టారో మరో సినిమాకి ప్లాన్ చేశారు. ఈ మూవీకి సైతం రామ్‌ చరణ్‌ నిర్మాతగా ఉంటున్నారు. దాదాపు కొణిదెల ప్రొడక్షన్స్ లోనే చిరంజీవికి సంబంధించిన వరుస 3 సినిమాలను చరణ్‌ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చిరుకి సంబంధించిన 152వ మూవీని అల్లుఅరవింద్‌ గీతా ఆర్ట్స్ లో ప్లాన్ చేయాలని చూస్తున్నారు. చరణ్‌ అందుకు అంగీకరించకపోవటంతో అల్లుఅరవింద్ కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ లో చిరు మూవీకి చరణ్‌ ఛాన్స్ ఇవ్వకపోవటంతో లాభాలన్నీ చరణ్‌ ఒక్కడే తీసుకుంటున్నాడే అనే ఆలోచన అల్లుఅరవింద్ లో ఉందట. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మొత్తానికైతే అల్లు ఆరవింద్ చెర్రీ మధ్య మొదటినుంచి ఇలాంటి వాతావరణం ఉంది అనేది సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus