మళ్ళీ రిపీటవ్వనున్న మెగా కాంబో!

  • October 13, 2016 / 12:21 PM IST

ఇంతకుముందు హీరో-హీరోయిన్ ల కాంబినేషన్ ను సినిమాకి ప్రామాణికంగా తీసుకొనేవారు. తదనంతర కాలంలో అది హీరో-విలన్, హీరో-కమెడియన్ కు చేరింది. ప్రస్తుతం అది ఇంకాస్త ముందడుగు వేసి హీరో-హీరో కాంబినేషన్ కు చేరుకొంది. “ఎవడు” చిత్రంలో రామ్ చరణ్-బన్నీ కలిసి నటించకపోయినా ఒకే సినిమాలో కలిసి నటించడం మెగా అభిమానులకు ఎక్కడలేని కిక్ ఇచ్చింది. ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే బావుండునని ప్రతి మెగా అభిమాని కోరుకొన్నాడు. ఇప్పుడా కోరికను నెరవేర్చేందుకు సురేందర్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది.

చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ధృవ”లో ఓ గెస్ట్ రోల్ ఉందట. తొలుత ఎవరైనా సీనియర్ హీరో చేస్తే బాగుంటుందని భావించిన చిత్ర బృందం.. అనంతరం సదరు రోల్ లో అల్లు అర్జున్ నటిస్తే సినిమాకి బ్రాండ్ వేల్యూ పెరగడంతోపాటు “ఎవడు” కాంబినేషన్ రిపీట్ అయ్యినట్లు ఉంటుందని భావించారు. మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేయడంతో అల్లు అర్జున్ కూడా మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకొన్నాడట. అన్నీ అనుకొన్నట్లుగా జరిగితే “ధృవ” చిత్రం మెగా అభిమానులకు విందు భోజనంలా రూపాంతరం చెందడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus