అల్లు అర్జున్, వక్కంతు వంశీ కలయికలో సినిమా ఫిక్స్

  • April 8, 2017 / 06:27 AM IST

సరైనోడు తర్వాత అల్లు అర్జున్…  హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేస్తున్నారు. గత నెల విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన వారంతా మరో హిట్ ని స్టైలిష్ స్టార్ తన ఖాతాలో వేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ, యాక్షన్ సమపాళ్లలో కలిసిన ఈ మూవీ మే రెండవ వారంలో రిలీజ్ కానుంది. దీని తర్వాత రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటిస్తారనే వార్తలు కొంతకాలంగా వినిపించాయి. ఆ విషయం నిజమని ఈరోజు స్పష్టమయింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి సినిమా విశేషాలతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేశారు.

శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్ర పోస్టర్ లో టైటిల్ ను మాత్రం వెల్లడించలేదు.  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఖారైనా వెంటనే వెల్లడిస్తారు. విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ అతి త్వరలో  సెట్స్ పైకి వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus