అల్లు అర్జున్, వక్కంతం వంశీ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే ?

  • June 7, 2017 / 09:18 AM IST

హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఈనెల 23 న రిలీజ్ కానుంది. దీని తర్వాత రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం అధికారిక ప్రకటన వెలువడింది. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది. విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్ చేశారు.

జూన్ 21 న హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అంటే డీజే రిలీజ్ కాకముందే బన్నీ మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నాడన్నమాట. సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ డీజే తో మరో సూపర్ హిట్ అందుకోబోతున్నట్లు టీజర్, ట్రైలర్, పాటలు చెబుతున్నాయి. అదే నిజమైతే వంశీ కాంబినేషన్లో తెరకెక్కే మూవీపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus