మహేష్, అల్లు అర్జున్ సినిమాల మధ్య వార్

  • April 19, 2017 / 09:51 AM IST

తెలుగు సినీ హీరోలకు పెద్ద పండుగ తమ బలాలను  ప్రదర్శించుకునే వేదిక వంటిది. అందుకే అప్పుడే తమ సినిమాలు రిలీజ్ కావాలని, విజయం సాధించాలని కోరుకుంటుంటారు. ఈ ఏడాది  మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, నటసింహ బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయి విజయాలను సొంతం చేసుకున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇలాంటి వార్ జరగనుంది. అయితే అది బాలకృష్ణ, చిరంజీవి చిత్రాల మధ్య కాదు..  సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాల మధ్య.   ప్రస్తుతం మహేశ్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమా చేస్తున్నారు.

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు మరో రెండు నెలల్లో థియేటర్లోకి రానున్నాయి. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కొత్త చిత్రాలను మొదలెట్టనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా, వక్కంతం వంశీతో బన్నీ ‘నా పేరు సూర్య’ సినిమా చేయబోతున్నారు. వీటిని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ రెండూ దేశభక్తి కథాంశాలతోనే తెరకెక్కనున్నాయి. మరి ఈ వార్ లో ఎవరు విన్ అవుతారో సంక్రాంతి తేల్చి చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus