ఫోటో స్టూడియో ప్రారంభించిన అల్లు అర్జున్ భార్య

  • September 8, 2016 / 12:27 PM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోడలు వ్యాపార సూత్రాలను ఒంట బట్టించుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  భార్య  బిజినెస్ ఉమన్ గా అవతారమెత్తింది. ఆమె తాజాగా ఒక స్టార్టప్ కంపెనీని నెలకొల్పింది. పిక్-ఏ-బూ ( PICABOO )  పేరిట  ఫోటో స్టూడియోను హైదరాబాదులో ఆరంభించింది. ఈ విషయాన్నీ బన్నీ స్వయంగా వెల్లడించారు. “నా భార్య స్నేహా రెడ్డి ఫోటో స్టూడియోను ప్రారంభించింది. తల్లిదండ్రులు, వారి పిల్లలతో కలిసి ఉండే అందమైన క్షణాలను కెమెరాలో బంధించి స్వీట్ మెమోరీస్ గా అందించడమే ఈ  స్టూడియో ప్రత్యేకత” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అల్లు అర్జున్, భార్య, కొడుకు అయాన్ తో కలిసి ఉన్న ఫొటోలన్నింటినీ పిక్-ఏ-బూ స్టూడియో ఫొటోగ్రాఫర్లే చిత్రీకరించినట్లు వివరించారు. ఈ స్టూడియో గురించి ప్రకటించిన వెంటనే కస్టమర్లు అధిక సంఖ్యలో స్పందించారని తెలిసింది. తమ చిన్నారుల ఫోటోలను చిత్రీకరించాలని కోరుతున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా సినీ సెలెబ్రిటీలే ఉన్నారంట. దీంతో అల్లు స్నేహా రెడ్డి బిజినెస్ ఎంట్రీ బాగానే ఉందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus