వక్కంతం వంశీ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కథ అదేనా?

  • June 14, 2017 / 10:23 AM IST

కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారారు. తొలిసారిగా అల్లు అర్జున్ ని డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. వీరి కలయికలో మూవీ నేడు లాంఛనంగా ప్రారంభమయింది. శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును ఖరారు చేశారు. అల్లు అర్జున్ సోల్జర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన బన్నీ మూవీ రికార్డులను తిరగరాసింది. మళ్ళీ కాంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు పెరిగాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుంది. అయితే ఈ మూవీ కథపైన ఫిలిం నగర్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ కొనసాగుతోంది.

అది ఏమిటంటే.. వాస్తవానికి వంశీని ఎన్టీఆర్ డైరక్టర్ గా పరిచయం చేయాలి. జనతా గ్యారేజ్ తర్వాత వంశీ డైరక్షన్లో సినిమా అని ప్రకటన కూడా చేశారు. కానీ ఎన్టీఆర్ బాబీ తో జై లవకుశ ప్రాజక్ట్ ని మొదలు పెట్టారు. ఎన్టీఆర్ కానీ, వంశీ కానీ తమ కాంబినేషన్ గురించి మాట్లాడలేదు. కానీ వీరి మధ్యలోకి అల్లు అర్జున్ వచ్చారు. దీంతో ఎన్టీఆర్ కథనే బన్నీ ఒకే చేశాడా? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిక్కుముడి వీడాలంటే వంశీనే నోరు విప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus