అవన్నీ అవాస్తవాలే అంటున్న కన్నడ సుందరి!

  • January 28, 2018 / 09:48 AM IST

“ఉన్నది ఒకటే జిందగీ” ఫ్లాప్ పెర్ఫామన్స్ తర్వాత ప్రయోగాలు చేయకుండా ఒక మంచి ఫక్తు కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టాలని డిసైడ్ అయిన ఎనర్జీటిక్ స్టార్ రామ్ తన నెక్స్ట్ సినిమా కోసం “సినిమా చూపిస్త మావ, నేను లోకల్” చిత్రాలతో డీసెంట్ హిట్స్ అందుకొన్న త్రినాధరావు నక్కినను దర్శకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రంలో తొలుత కథానాయికగా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారనే కథనాలు వెలువడ్డాయి. అవన్నీ నిజం కావని డైరెక్టర్ తేల్చేయగా.. తర్వాత కన్నడ సుందరి రష్మిక మండన్న పేరు కూడా వినిపించింది. కొందరైతే కన్ఫర్మ్ అని కూడా చెప్పేశారు.

అయితే.. ఇటీవల “ఛలో” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన రష్మికను తన నెక్స్ట్ తెలుగు సినిమాల గురించి అడగగా.. చాలా సింపుల్ గా వేరే సినిమాలేమీ అంగీకరించలేదని చెప్పేసింది. ముఖ్యంగా రామ్ సినిమా గురించి అడగ్గా అసలు నా వద్దకు ఆ సినిమా ఆఫర్ కూడా రాలేదని, అలాంటప్పుడు నేనెలా సమాధానం చెబుతానని చెప్పింది.

సో, ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైన రామ్ టీం ప్రస్తుతం రామ్ సరసన సరిపోయే హీరోయిన్ కోసం దేవతలు అమృతం కోసం క్షీర సాగర మధనం చేసినట్లుగా భాషా బేధం లేకుండా అన్నీ ఇండస్ట్రీస్ మరియు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రొఫైల్స్ ను ఫిల్టర్ చేస్తున్నారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus