అమలాపాల్ త్యాగం చేసిందనే చెప్పాలి!

  • August 16, 2016 / 10:58 AM IST

కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన అమలాపాల్ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా, విజయ్ లు ఇంత తొందరగా విడిపోవడానికి కారణాలు ఏంటి అని కోలీవుడ్ మీడియా రోజుకో వార్త ప్రచురిస్తూనే ఉంది. రీసెంట్ గానే ఈ జంట మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులకు అప్లై చేశారు. కోర్టులో అమలాపాల్ కోరుకుంటే భర్త నుండి భరణాన్ని పొందవచ్చు.

సుమారుగా 10 కోట్ల వరకు అమలా భరణాన్ని డిమాండ్ చేయొచ్చు కానీ అమలా అలా చేయలేదట. పైగా తను భరణాన్ని ఆశించట్లేదని పిటీషన్ లో పేర్కొంది. అమలాపాల్ ఇలా చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని కొందరు అమలా, విజయ్ కోసం త్యాగం చేసిందని చెప్పుకుంటుంటే మరికొందరు మాత్రం విడాకుల వరకు పరిస్థితి రావడానికి కారణం అమలే కాబట్టి భరణాన్ని కోరలేకపోతోందని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus