ఒకే తెరపై అమితాబ్-అమీర్ !

  • September 8, 2016 / 07:10 AM IST

కొన్ని కాంబినేషన్లు అంతే మహా ముచ్చటగా ఉంటాయి. అసలా ఊహే వాస్తవ ప్రపంచాన్ని గాలికొదిలేసి ఊహా ప్రపంచాన్ని ఏలేస్తుంది. అలాంటివి వాస్తవాలుగా మారితే ఆ ఆనందాన్ని దేనితోనూ కొలవలేం. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేషన్ కూడా అటువంటిదే. ఈ ఇద్దరి కలయికలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఓ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని అమీర్ సైతం ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.

అమితాబ్ తో నటించాలన్న తన కల సాకారమైనదని అమీర్ తన ఆనందాన్ని తెలిపారు. ‘ధూమ్ 3’ సినిమా దర్శకుడు విజయకృష్ణ ఆచార్య ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి మూలం ‘కన్ ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ నవల. సినిమా ప్రకటనతో పాటు విడుదలని ప్రకటించడం విశేషం. 2018 దీపావళికి ఈ చిత్రం తెరపైకి రానుంది.

https://www.youtube.com/watch?v=4Ek0ryQGGL0

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus