మొత్తానికి లాస్యనే స్పందించింది..!

  • June 26, 2019 / 01:20 PM IST

‘బిగ్‌బాస్‌3’ తెలుగు సీజన్‌లో మరో మూడు వారాల్లో మొదలుకానుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో కంటెస్టెంట్‌లు ఎవరనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే శ్రీముఖి, లాస్య, హీరో వేణు, ఉప్పల్ బాలు, హేమచంద్ర, కమల్ కామరాజు అంటూ సోషల్ మీడియాలో రక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ యాంకర్ శ్రీముఖి కి ఈ షో కోసం 50 లక్షలు, లాస్య కోసం 30 లక్షలు పారితోషికం ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం పై యాంకర్‌ లాస్య స్పందించింది.

లాస్య తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయం క్లారిటీ ఇచ్చింది. “మీకో విషయం తెలుసా.. నేను బిగ్‌ బాస్‌కు వచ్చేస్తున్నాను. బిగ్‌బాస్‌లో లాస్య కన్ఫార్మ్‌ అయిపోయింది. లాస్యకు బిగ్‌బాస్‌ వాళ్ళు షో స్టార్ట్‌ కాకముందే 30 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్ధం. ‘ఇట్స్‌ ఏ ఫేక్‌ న్యూస్‌’. నేను బిగ్‌బాస్‌లోకి రావడం లేదు.. ఈ వార్తలు చూసి నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్తున్నారు. నాకు రెండునెలల చిన్నబాబు ఉన్నాడు. ఇప్పుడు టైమంతా బాబుతోనే సరిపోతుంది. ఓ ఏడాది పటు పూర్తిగా బాబుతోనే గడపాలని నిశ్చయించుకున్నాను. మే బి నెక్ట్స్‌ టైమ్‌ ఈ ఛాన్స్ వస్తే చూద్దాం” అంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus