Rashmi: మెగాస్టార్ అద్భుతమైన వ్యక్తి…రష్మీ కామెంట్స్ వైరల్!

  • July 19, 2023 / 08:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేది విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను చిరు లీక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా చిరంజీవి యాంకర్ రష్మితో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పాట గురించి రష్మీ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మీ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే బుల్లితెరపై సక్సెస్ అయిన విధంగా ఈమె వెండితెరపై సక్సెస్ కాలేకపోయారు. తాజాగా మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నటువంటి ఖుషీ’లోని ‘యే మేరా జహా’ పాటకు చిరు స్టెప్స్‌ వేస్తూ ఆ లీక్‌ వీడియోలో చిరంజీవి కనిపించారు. ‘తమ్ముడి పాట మస్తుందిలే’ అని చిరంజీవి అన్న డైలాగ్‌లో రష్మీ చిరు పక్కనే స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసింది.

ఇలా ఈ పాటలో రష్మీ (Rashmi) మెగాస్టార్ తో కలిసి డాన్స్ వేయడం పట్ల అభిప్రాయాలను తెలియజేస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ నేను తెలుగులో నేర్చుకున్న మొదటి పాట చిరంజీవి గారిదే. ఆయనతో కలిసి డాన్స్ చేయాలంటే చాలా భయం వేసింది. కానీ చిరంజీవి గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఏదైనా ఒక సీన్ షూట్ చేసే ముందు ఆయన ప్రతిసారి నాతో మాట్లాడేవారని తెలిపారు.

ఈ విధంగా భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఒక పాటకు మొత్తం డాన్స్ చేశానని రష్మీ తెలిపారు.అంత పెద్ద స్టార్ అయినటువంటి చిరంజీవి గారు అందరితోనూ చాలా సరదాగా ఉంటారని రష్మీ తెలిపారు. ఇక మెగాస్టార్ గురించి చెప్పాలి అంటే ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి గురించి రష్మీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus