మంచి అవకాశం అందుకున్న అను ఇమ్యానుయేల్!

  • September 15, 2018 / 12:40 PM IST

“హమ్మయ్య..” అని అను ఇమ్యానుయేల్ ఊపిరి పీల్చుకుంది. తనపైనున్న ఐరెన్ లెగ్ అనే ముద్ర తొలిగిపోయినందుకు సంతోషపడుతోంది. మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అను ఇమ్యానుయేల్… “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో హీరోయిన్ గా నటించింది. ఏది విజయం సాధించలేదు. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య అయినా కెరీర్ ని పరుగులెత్తిస్తుందనుకుంటే అది కూడా నిరాశపరిచింది. దీంతో ఆమెకు ఐరెన్ లెగ్ గర్ల్ అని పేరు పెట్టేసారు. అందుకే ఆమె ఆశలన్నీ శైలజారెడ్డి అల్లుడు మూవీపైనే పెట్టుకుంది. మారుతీ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మొన్న రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది.

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11 .4 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాగచైతన్య కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో అను ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆ ఆనందాన్ని రెట్టింపు చేసే మంచి ఛాన్స్ అందుకుంది. తమిళ హీరో ధనుష్, కింగ్ నాగార్జున చేస్తున్న మల్టీ స్టారర్ మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి, శరత్ కుమార్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీ హిట్ అయితే కోలీవుడ్ లోను అను అనేక ఆఫర్లు అందుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus