ప్రభాస్ ‘సాహో’ పై సంచలన కామెంట్లు చేసిన అనుష్క..!

  • May 22, 2019 / 01:07 PM IST

‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ చిత్రాన్ని సుమారు రెండు సంవత్సరాల పాటూ చిత్రీకరించారు. ‘బాహుబలి’తో ప్రభాస్‌కు ఇండియా వైడ్ క్రేజ్ ఏర్పడింది కాబట్టి ‘సాహో’ చిత్రాన్ని కూడా నాలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నిన్న ఓ పోస్టర్ ద్వారా ‘సాహో’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ప్రభాస్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు.

ఇక ఈ పోస్టర్ పై ‘బాహుబలి హీరోయిన్‌’ మరియు ప్రభాస్ కు అత్యంత సన్నిహితురాలైన అనుష్క శెట్టి స్పందించింది. అనుష్క స్పందిస్తూ… ‘ ‘సాహో’ చిత్రం నుండీ వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌, ‘యూవీ క్రియేషన్స్‌’, దర్శకుడు సుజిత్‌కు.. అలాగే ఈ చిత్రంలోని భాగస్తులందరికీ ఆల్‌ ది బెస్ట్‌..’ అంటూ అనుష్క పేర్కొంది. ‘యూవీ క్రియేషన్స్’ వారితో కూడా అనుష్క కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరు నిర్మించిన ‘మిర్చి’ ‘భాగమతి’ చిత్రాల్లో కూడా అనుష్క నటించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus