ఇంకా.. ఇంకా.. ‘నిశ్శబ్దం’ ఎందుకు?

  • August 28, 2020 / 04:08 PM IST

ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని తేలిపోయిన తరుణంలో.. ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చెయ్యడానికి రెడీ అయిపోయారు నిర్మాత దిల్ రాజు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. సెప్టెంబర్ 4 రాత్రి నుండే ‘వి’ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్టు కూడా అమెజాన్ వారు ప్రకటించారు.

అంతేకాదు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. మరో క్రేజీ మూవీ ‘నిశ్శబ్దం’ ను కూడా ఓటిటిలో విడుదల చేస్తే డిజిటల్ మీడియా సంస్థలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. కొందరు భావిస్తున్నారు. అయితే ‘నిశ్శబ్దం’ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా తగ్గడం లేదు.దానికి ప్రధానంగా రెండు కారణాలు అని తెలుస్తుంది.

నిర్మాతలు సినిమాకు పెట్టిన బడ్జెట్ కు అలాగే ఓటిటి సంస్థలు చెప్పే రేటుకి అస్సలు సంబంధం లేదనేది ఒక కారణమైతే.. 2 ఏళ్ళ తరువాత అనుష్క నుండీ రాబోతున్న చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చెయ్యాలనుకోవడం మరో కారణం అని తెలుస్తుంది.ఏదేమైనా దసరా లోపు నిర్మాతలు ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందనేది కూడా ఇన్సైడ్ టాక్. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus