అవార్డు అందుకున్నప్పటికీ.. అది పెద్ద డిజాస్టర్ అంట..!

Ad not loaded.

‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది హాట్ యాంకర్ అనసూయ. ఒక పక్క యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘క్షణం’ ‘విన్నర్’ ‘గాయిత్రి’ వంటి విభిన్న చిత్రాల్లో నటించింది. అయితే 2018 లో చేసిన ‘రంగస్థలం’ చిత్రం ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్రకు అనసూయ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక ఈ పాత్రకిగాను తొలి అవార్డు ‘జీ సినిమా అవార్డ్స్’ వేదికపై అందుకున్న అనసూయ, తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించింది.

అనసూయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” ‘జీ సినిమా అవార్డ్స్’ నుంచి రంగమ్మత్త పాత్రకిగాను మొదటి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ అవార్డుకిగాను నాకు వోట్ చేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. అవార్డును గెలిచిన ఆనందంలో నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. అప్పుడు నా స్పీచ్ పెద్ద డిజాస్టర్ అని నాకు అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ , అలాగే మా చిట్టిబాబు (చరణ్) అలాగే నా భర్త .. అమ్మానాన్నలకీ, ‘రంగస్థలం’ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయాను. మీరంతా కూడా నా క్షమాపణలను అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus