బాలు నాయుడు,ఆశా సుదర్శన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’. ‘సిల్వర్ స్క్రీన్ షాట్స్’ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పచ్చ, బాలు నాయుడు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్యనే ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘అరణ్య ధార’ ట్రైలర్ ను ‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు.
తర్వాత హీరో వెళ్లి ఓ అడవిలో పడతాడు. ట్రైలర్లో ఎక్కువ షాట్స్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి. సో కథకి, ఫారెస్ట్ కి లింక్ చేస్తూనే ‘అరణ్య ధార’ అనే టైటిల్ ను పెట్టారు. అయితే కథలో ఉన్న డెప్త్ తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.