మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైజయంతీ మూవీస్ సినిమా ఇదే

  • May 14, 2018 / 01:20 PM IST

సీనియర్ ఎన్టీయార్, ఏయన్నార్, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీయార్ వంటి హీరోలందరితోనే వరుస సినిమాలు రూపొందించి.. అదే జోరులో “శక్తి” అనే సినిమా రూపొందించి దారుణంగా దెబ్బ తిన్న అశ్వినీదత్.. ఆ తర్వాత తన కుమార్తెలు స్థాపించిన “స్వప్న సినిమా” బ్యానర్ లో “బాణం, ఓం శాంతి, సారోచ్చారు” లాంటి ఫ్లాప్ మూవీస్ తీసి ఇంకాస్త నష్టపోయాడు. దాంతో కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగానే ఉన్నారు అశ్వినీదత్. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “మహానటి”తో నిర్మాతగా బౌన్స్ బ్యాక్ అయ్యారు.

“మహానటి” అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ అశ్వినీదత్ కు ప్రౌడ్ కమ్ బ్యాక్ ఫిలిమ్ గా నిలిచింది. ఆల్రెడీ నాని-నాగార్జున కాంబో మూవీ, మహేష్ బాబు 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న అశ్వినీదత్ తన బ్యానర్ లో “కంత్రీ” లాంటి యావరేజ్ ఫిలిమ్, “శక్తి” లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఎన్టీయార్ తోనే మరో సినిమా చేసేందుకు అశ్వినీదత్ సన్నద్ధమవుతున్నారు. దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటించనప్పటికీ.. ఎన్టీయార్ 30వ సినిమాగా ఈ చిత్రం మొదలవ్వబోతోందట. ఈ విషయాన్ని అశ్వినీదత్ స్వయంగా ప్రకటించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus