ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ కు గాయాలు

  • July 31, 2019 / 05:36 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆగష్టు 30 న ఈ చిత్రం విడుదల కానుంది. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం మ్యూజిక్ కంపోజర్లలో ఒకరైన గురు రాన్ధవా గాయాలపాలవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా పేజీ ద్వారా తెలియజేసాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

రాన్ధవా కెనడాలో జరుగుతున్న ఓ లైవ్ మ్యూజిక్ షోకి హాజరైన సందర్భంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. పంజాబీ ఫ్యామిలీకి చెందిన కెనడా వ్యక్తి… గురు వేదిక పై వెళ్తున్న సమయంలో అడ్డగించి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. అదృష్టవశాత్తు గురు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఆయన కుడి వైపు నుదిటి పై మాత్రం నాలుగు కుట్లు పడ్డాయి. ఇక తాజాగా విడుదలైన ‘సాహో’ రెండో పాట ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్ ని కంపోజ్ చేసింది గురు రాన్ధవా.

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus