షాకిస్తున్న నాగార్జున హీరోయిన్ లుక్…!

  • April 11, 2020 / 05:27 PM IST

టాలీవుడ్ కి బాలీవుడ్ భామల్ని పరిచయం చేయడంలో పూరి జగన్నాధ్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లను ఈయన టాలీవుడ్ కు పరిచయం చేసాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఈ లిస్టు లో అయేషా టాకియా కూడా ఉంది. 15 ఏళ్లకే హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ ‘తార్జన్ : ది వండర్ కార్’, ‘దిల్ మాంగే మోర్’ ‘సోచ న తా’ ‘షాదీ నెంబర్ 1’ వంటి చిత్రాలు చేసింది. 2005 లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘సూపర్’ చిత్రంతో ఈమె ప్రేక్షకులకి పరిచయం అయ్యింది.

ఈ చిత్రంలో సిరి వల్లి అనే పాత్రలో ఈమె నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యింది. ఈ చిత్రంతో ఈమెకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఎందుకో ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో సినిమాలు చెయ్యలేదు. నిజానికి మహేష్ బాబు ఆల్ టైం హిట్ అయిన ‘పోకిరి’ సినిమాలో మొదట ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ కు దూరం అయ్యింది. అయితే విచిత్రంగా ‘పోకిరి’ హిందీ రీమేక్ అయిన ‘వాంటెడ్’ లో సల్మాన్ సరసన నటించింది.

ఒరిజినల్ లో మిస్ అయినా రీమేక్ లో నటించింది అన్న మాట. 23 ఏళ్ళకే అంటే 2009 లో ఫరాన్ అజ్మీని పెళ్ళి చేసుకుని సినిమాలని తగ్గించింది. ఇక తాజాగా… ఏప్రిల్ 10 న తన 34 వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో అయేషా మునిగి తేలింది. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు ‘అయేషా ఇలా అయిపొయింది ఏంటి’ అంటూ షాక్ అవుతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus