సాహో సెంటిమెంట్ ప్రభాస్ ని వెంటాడిందా..?

  • March 16, 2020 / 01:22 PM IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ ఎలా ఉన్నా..అక్కడ అందమైన ప్రదేశాలలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ గురించి ఓ బ్యాడ్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా సైరా ఫేమ్ అమిత్ త్రివేదిని ఎంపిక చేశారు. కారణాలేమిటో తెలియదు గానీ..అమిత్ త్రివేది ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. అమిత్ త్రివేది చిరు నటించిన పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వి చిత్రానికి కూడా అమిత్ సంగీతం అందిస్తున్నారు.

కాగా గత ఏడాది విడుదలైన సాహో విషయంలో కూడా ఇలానే జరిగింది. సాహో సినిమాకు బీజీఎమ్ అందించే బాధ్యతలను మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ కి ఇవ్వడం జరిగింది. పాటలు కంపోజ్ చేసే బాధ్యత బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్, ఎహసాన్, లోయ్ లు తీసుకున్నారు. ఐతే తరువాత చిత్ర నిర్మాతలు ఒక్కో పాట ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కి ఇవ్వడం జరిగింది. ఇది నచ్చని మ్యూజిక్ త్రయం ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించారు. అది సినిమాపై కొంచెం నెగెటివ్ ప్రచారం వచ్చేలా చేసింది. ప్రభాస్ తాజా చిత్రం విషయంలో కూడా ఇలా జరగడం బాధాకరం. ఐతే దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus