బాహుబలి బృందాన్ని భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్

  • February 9, 2017 / 11:08 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో వచ్చిన బాహుబలి బిగినింగ్ భాషాబేధం లేకుండా, ఎల్లలు దాటుకొని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాల స్థాయిని పెంచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ అనేక హంగులు అద్దుకుని ఏప్రిల్ 28 న రిలీజ్ కావడానికి ముస్తాబు అవుతోంది. తొలి కాపీ సిద్ధం కాకముందే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. వెయ్యికోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న జక్కన్న బృందానికి ఓ సెంటిమెంట్ భయపెడుతోంది. తెలుగు చిత్రాలకు సీక్వెల్స్ కలిసి రాలేదు.

ఎన్నో అంచనాలతో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్, సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, మనీ-2 వంటి ఎన్నో సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. ఈ సెంటిమెంట్ రాజమౌళి టీమ్ ని వెంటాడుతోంది. అసలే సెంటిమెంట్ ని బాగా ఫాలో అయ్యే సినీ జనులు చాలామంది బాహుబలి 2 విషయంలో ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహాలను, భయాలను పారదోలేందుకు రెట్టింపు కసితో దర్శకధీరుడు అండ్ కో .. కలిసికట్టుగా శ్రమిస్తున్నారు.  సీక్వెల్ సెంటిమెంట్ ని  బాహుబలి ౨ తునాతునకలు చేస్తుందా? లేదా? తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus