“అరవింద సమేత” వేడుకకి రాబోతున్న బాలకృష్ణ, మహేష్ బాబు!

  • September 10, 2018 / 07:58 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి ఎస్ ఎస్ థమన్  సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలను ఈనెల 20 న రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని “నోవాటెల్” హోటల్లో ఈ వేడుకని వైభవంగా నిర్వహించనున్నారు.    ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ వస్తారని మొదట్లో బయటికి వచ్చింది. తాజా సమాచారం మేరకు మరో స్టార్ హీరో మహేష్ బాబు కూడా రానున్నట్లు తెలిసింది. మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సినిమా వేడుకకి ఎన్టీఆర్ హాజరై మంచి సంస్కృతికి నాంది పలికారు. అలాగే తామంతా ఒకటేనని, అభిమానులు గొడవపడవద్దని పరోక్షంగా చెప్పారు.

సో ఇప్పుడు మహేష్ బాబుకి తన స్నేహాన్ని చాటుకునే సమయం వచ్చింది. అందుకే అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుకకి రాబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.  హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus