మొన్నటి వరకూ పవన్… ఇప్పుడు బాలయ్య?

  • June 7, 2019 / 03:07 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ నుండీ సెట్స్ పైకి వెళ్ళనుంది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి .. జగపతిబాబు పవర్ఫుల్ పాత్రలను పోషించబోతున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

అయితే ఈ చిత్ర కథ అనిల్ మొదట… బాలకృష్ణ కోసం రాసుకున్నాడట. బాలకృష్ణ 100వ చిత్రం సమయంలోనే అనిల్ ఈ ఒక కథను బాలయ్యకు వినిపించాడట. బాలయ్యకు కూడా ఈ కథ నచ్చిందట కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. బాలయ్య క్రిష్ డైరెక్షన్లో తన 100వ చిత్రంగా ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ చేసాడు. ఆ తరువాత ఇతర ప్రాజెక్టులతో బాలయ్య బిజీ అయిపోవడం కూడా జరిగింది. ఏదేమైనా బాలకృష్ణ కోసం అనుకున్న కథనే మహేష్ కి తగినట్టుగా మార్చాడట అనిల్. ఇలా మరో హీరో చేయాల్సిన సినిమా మహేష్ చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ కోసం అనుకున్న చాలా కథల్ని మహేష్ బాబు తో చేసారు దర్శకులు. ఇప్పుడు బాలయ్య కథతో మహేష్ సినిమా చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus