Balakrishna: అప్పుడే అసలు మజా ఉంటుందన్న బాలయ్య!

  • October 15, 2021 / 01:20 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో ప్రసారం కానుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మనిషి లైఫ్ లో ఒక ప్రయాణం ఉంటుందని రాయికి దెబ్బలు తగిలితే మాత్రమే శిల్పం అవుతుందని చెప్పారు. అదే విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయని వాటికి అధిగమించి లక్ష్యాన్ని చేరడమే అన్ స్టాపబుల్ అని బాలయ్య తెలిపారు.

ఈ టాక్ షోకు సంబంధించిన కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే ఈ షో చేయడానికి అంగీకరించానని బాలకృష్ణ కామెంట్లు చేశారు. నవంబర్ 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఈ షో ప్రసారం కానుంది. సినిమాల్లో అన్ని రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నానని ప్రేక్షకులు ప్రేమాభిమానాలతో తనను ఆదరిస్తున్నారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగుజాతి ఎంతో చేయాలనే ప్రేరణ ఇస్తుందని బాలయ్య తెలిపారు. అల్లు అరవింద్ మానసపుత్రిక ఆహా ఓటీటీ అని ఈ షో కొరకు ప్రశాంత్ వర్మతో పాటు ఎంతోమంది కష్టపడుతున్నారని బాలయ్య పేర్కొన్నారు.

ప్రతి రంగంలో పోటీ ఉంటుందని పోటీ ఉంటే మాత్రమే అసలు మజా ఉంటుందని బాలయ్య అన్నారు. మనమంతా మనుషులుగా ఒకటే అని బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చిన సమయంలోనే అసలు మనిషి ఆవిష్కరించబడతాడని బాలయ్య తెలిపారు. టాలీవుడ్ కు బాహుబలి ఎంతో గౌరవాన్ని తెచ్చిందని అలాంటి గౌరవాన్ని నిలబెట్టటానికి ఆహా ఉంటుందని బాలకృష్ణ పేర్కొన్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus