‘పీక కోస్తా.. ఏసీపాడదొబ్బుతా’ అంటున్న బాలయ్య..!

  • April 4, 2019 / 01:39 PM IST

ప్రముఖ సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ మరోసారి నోరు జారాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తున్న బాలయ్య మరోసారి అభిమానుల పై మండిపడ్డాడు. ఈసారి ఎన్నికల్లో మీకు మెజార్టీ పెరుగుతుంది సార్ అంటూ.. అభిమానులు బాలయ్యను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తే… బాలయ్య మాత్రం తిట్టిపోసాడు. విషయంలోకి వెళితే.. మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగబోతుండగా.. బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి సతీ సమేతంగా హిందూపురంలో ప్రచారానికి వెళ్ళాడు.

అయితే .. ఈ క్రమంలో ఈ సారి ఎన్నికల్లో 50వేలు మెజార్టీ రావడం పక్కా అంటూ కొందరు అభిమానులు ఆయన దగ్గర అరిచారు. కానీ.. వారిచ్చిన ప్రోత్సాహాన్ని బాలయ్య నెగిటివ్ గా తీసుకోవడం గమనార్హం. ‘గెలవడమే కష్టంగా ఉంటే.. వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాగే చెప్తారు జనాలు’… అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో అభిమాని.. సార్ 60 వేలు, 70 వేలు మెజారిటీ సార్‌ అంటూ అరవడంతో.. “అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా” అంటూ తిట్లు తిడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus