దీపికా పడుకొనె టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో జరిగిపోయింది.. కానీ?

  • July 20, 2020 / 07:35 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. జూలై 10 న ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. అయితే ఆ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను అంత సంతృప్తిపరచ లేదు అనే చెప్పాలి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘ప్రభాస్ 21’ టీం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ తన 21వ చిత్రాన్ని ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో దీపికా పడుకొనే హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు నిన్న అధికరికంగా ప్రకటించారు. ‘ప్రభాస్ 21’ తోనే దీపిక టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందని ఓ రేంజ్లో డిస్కషన్ నడుస్తుంది. అయితే దీపిక ఎప్పుడో ఓ టాలీవుడ్ సినిమాలో నటించిందన్న సంగతి చాలా మందికి తెలీదు. అవును.. అసలు మ్యాటర్ ఏంటంటే..ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన జయంత్.సి. పరాన్జీ.. గతంలో ‘లవ్ ఫర్ ఎవర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే ఆ చిత్రం విడుదల కొన్ని కారణాల వల్ల అటకెక్కిందట. ఆ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో దీపిక కనిపిస్తుందట. ఆ చిత్రం అప్పుడు విడుదల కాలేదు కానీ.. ప్రస్తుతం ఓటిటిలో విడుదల చేసే పనులైతే నిర్మాతలు చేస్తున్నారట. ఒకవేళ వారి ప్రయత్నం వర్కౌట్ అయితే.. దీపిక టాలీవుడ్ ఎంట్రీ ‘లవ్ ఫర్ ఎవర్’ చిత్రంతోనే అవుతుంది అని చెప్పాలి.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus