Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)  హీరోగా తెరకెక్కిన ‘భైరవం’ (Bhairavam) సినిమా మే 30 న రిలీజ్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గరుడన్’ కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith)  వంటి హీరోలు కూడా కీలక పాత్రలు పోషించారు. దీంతో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మాస్ ఏరియాల్లో ఈ సినిమాని బాగానే చూస్తున్నారు.

Bhairavam

కానీ మిగిలిన ఏరియాల్లో ఈ సినిమాకి జనాలు లేరు. దీనికి కారణం ఏంటని అడిగితే.. ఎవ్వరైనా తడుముకోకుండా రీ- రిలీజ్ అయిన ‘ఖలేజా’ (Khaleja)  అనే చెబుతారు. అదే నిజం కూడా..! సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ సినిమాని రీ- రిలీజ్ చేశారు. దానికి వసూళ్లు బాగా వచ్చాయి. అలా అని ‘గిల్లి’ (Ghilli)  రేంజ్ కలెక్షన్స్ కాదు. టాలీవుడ్ రీ- రిలీజ్లలో ఆల్ టైం రికార్డు కొట్టినా..

ఆ సినిమా రీ- రిలీజ్ కి కూడా ఇది సరైన సమయం కాదు అనే చెప్పాలి. ‘భైరవం’ విషయానికి వస్తే.. ఈ సినిమాని రూ.30 కోట్ల బడ్జెట్లో నిర్మించారు. థియేట్రికల్ రిలీజ్ అడ్వాన్స్ బేసిస్ పై చేశారు. మొత్తంగా 40 శాతం రికవరీ అవుతుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 20 శాతం రికవరీ సాధించొచ్చు. మిగిలిన 40 శాతం నష్టాలు తప్పేలా లేవు. ‘ఖలేజా’ రీ- రిలీజ్ తో పాటు ఐపీఎల్ మ్యాచ్..లు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై గట్టి దెబ్బ కొట్టినట్టు అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus