ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Raja saab) ఒకటి. 2022 లోనే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మొదలైంది ఈ సినిమా. దీంతో ‘బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా అనుకున్నారు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ప్రభాస్ అన్ని సినిమాల కంటే కూడా ఆలస్యమవుతూ వస్తుంది.
2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని మేకర్స్ ప్రకటించడం జరిగింది. కానీ ఆ టైంకి సినిమా రాలేదు. కనీసం పోస్ట్ పోన్ అయ్యింది అని స్పందించింది కూడా లేదు. నిర్మాత కానీ, దర్శకుడు కానీ.. మాకు సంబంధం లేదు అన్నట్టు.. ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కూర్చున్నారు. మొత్తానికి ఈరోజు విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇచ్చారు.
డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని వెల్లడించారు. సాధారణంగా సినిమా వాయిదా అంటే ఏ నెల రోజులో, 2 నెలలో ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు. కానీ రాజాసాబ్ సినిమా ఏకంగా 8 నెలల వరకు పోస్ట్ పోన్ అయినట్లు ప్రకటించారు. షూటింగ్ పార్ట్ ఇంకో 25 రోజులు చేయాల్సి ఉంది. మారుతి అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అని చెప్పాడు. 25 రోజుల షూటింగ్ కి ఏకంగా 8 నెలలు సినిమా రిలీజ్ వాయిదా వేయడం ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
‘పీపుల్ మీడియా..’ వారికి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఎందుకంటే 2023 నుండి చూసుకుంటే వాళ్ళు రూ.250 కోట్ల వరకు నష్టపోయారు. ‘ది రాజాసాబ్’ తో మొత్తం వెనక్కి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ‘ది రాజాసాబ్’ ను రూపొందిస్తున్నట్టు టీం చెబుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే జూన్ 16 వరకు వేచి చూడాలి.
Teaser on June 16th at 10:52Am
Film releasing on December 5th#TheRajaSaab #Prabhas pic.twitter.com/YZ9zgHftvT— Filmy Focus (@FilmyFocus) June 3, 2025