వేలమంది సమక్షంలో భరత్ అనే నేను షూటింగ్

  • January 29, 2018 / 07:27 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా ఫస్ట్ ఓత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ కూడా అదరగొట్టింది. నేటి తరం ముఖ్యమంత్రిగా మహేష్ ఆకర్షించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. అక్కడ క్లైమాక్స్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్లో మహేష్ బాబు తో పాటు వేలమంది పాల్గొంటున్నారు. పబ్లిక్ మీటింగ్ సమయంలో ఈ భారీ ఫైట్ జరుగుతుందంట. దీనిని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మరింత బాగా షూట్ చేస్తున్నారు.

ఇది సినిమాలో ప్రధాన హైలెట్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ షూటింగ్ తర్వాత మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కథ ద్వారా మరో మంచి సందేశాన్ని కొరటాల శివ ఇవ్వబోతున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇస్తున్నారు. ఐటెం సాంగ్ మినహా ఇందులో అన్ని రకాల పాటలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భరత్ అనే నేను ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus