పొల్లాచి లో భరత్ అనే నేను!

  • November 11, 2017 / 07:13 AM IST

శ్రీమంతుడు మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న భరత్ అనే నేను మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. గతవారం వరకు  హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్  కి బ్రేక్ ఇచ్చి వాణిజ్య ప్రకటన షూటింగ్‌ కోసం మహేష్ యూరప్‌ వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఈ యాడ్ చిత్రీకరణ పూర్తి అవుతుందని సమాచారం. మహేష్ తిరిగి రాగానే భరత్ అనే నేను షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ తాజా షెడ్యూల్ తమిళనాడు లోని పొల్లాచి లో మొదలు పెట్టనున్నారు. అక్కడ ఒక యాక్షన్ సీన్ తెరకెక్కించనున్నట్లు తెలిసింది.

పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో నవ్వించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.  భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus