వైజాగ్ లో కాక విజయవాడలో నిర్వహించేందుకు.!

  • March 24, 2018 / 01:25 PM IST

మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో నిర్వహించేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారని, అందుకోసం వైజాగ్, ఆర్కే బీచ్ లో అసెంబ్లీ సెట్ వేస్తున్నారని కూడా మీకు తెలియజేశామ్. అయితే.. తాజా సమాచారం ప్రకారం వెన్యూలో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వైజాగ్ లో శ్రేయాస్ మీడియా ఈవెంట్ ను నిర్వహించేందుకు దానయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. “రంగస్థలం” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో చోటు చేసుకొన్న సెక్యూరిటీ ఇష్యూస్ ను చూసి “భరత్ అనే నేను” చిత్రబృందం భయపడుతోందట.

అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశంతోపాటు, సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉండడంతో.. “భరత్ అనే నేను” ప్రీరిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో కాక విజయవాడలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారట. విజయవాడలోని ఏదైనా కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారట. అయితే.. డెసిషన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. అయిన వెంటనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట దర్శకనిర్మాతలు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని మొదటి పాటను రేపు విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus