రేపటి నుంచి భరత్ అనే నేను కొత్త షెడ్యూల్

  • January 8, 2018 / 06:17 AM IST

విద్యార్థులకు పండుగ హాలీ డేస్ ఇప్పుడు మొదలయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ కి మాత్రం హాలిడేస్ ముగిసాయి. స్పైడర్ తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 24 వరకు తమిళనాడులోని కారైకుడిలో షూటింగ్ జరిగింది. దీని తర్వాత ఎక్కువ రోజులు సెలవు తీసుకున్నారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో కలిసి కలిసి విదేశాలకు వెళ్లారు. క్రిసమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తం అక్కడే జరుపుకున్నారు. ఒమన్ దేశంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టారు. నిన్నటితో ఈ టూర్ ముగిసినట్లు తెలిసింది. హైదరాబాద్ కి చేరుకున్న మహేష్ రేపటి నుంచి కొత్త షెడ్యూల్లో పాల్గొననున్నారు.

ఈ షెడ్యూల్లో కొన్ని సీన్స్ తో పాటు మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించనున్నారు. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కనిపించనున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus