అత్యధిక ధర పలికిన భరత్ అనే నేను శాటిలైట్ రైట్స్!

  • June 5, 2018 / 05:35 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  బ్రహ్మోత్సవం, స్పైడర్ .. రెండూ విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ మహేష్ సినిమాపై క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. పైగా పెరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అను నేను సినిమా బ్లక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో శాటిలైట్  హక్కులను సొంతం చేసుకోవడానికి ఛానళ్లవారు పోటీ పడ్డారు. ఓ ఛానల్ వాళ్ళు 22 కోట్లు చెల్లించి  శాటిలైట్  హక్కులను కైవశం చేసినట్లు తెలిసింది. ఇంతమొత్తంలో ఏ తెలుగు సినిమా ధర పలకలేదు.

బాహుబలి చిత్రాలు సైతం రెండు కలిపి 25 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలిసారి ఒక చిత్రం ఇన్నికోట్లు పలకడం ఇదే ప్రథమం. ఈ విధంగా మహేష్ బాబు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ చిత్ర ఘనవిజయం అందించిన ఉత్సాహంతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సినిమా ఈనెల సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలి షెడ్యూల్ డెహ్రా డూన్ లో మొదలు కానుంది. రెండో షెడ్యూల్ అమెరికాలో సాగనుంది. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus