ఎన్టీఆర్ 27 కథపై వస్తున్న వార్తలను ఖండించిన బాబీ బృందం

  • February 25, 2017 / 07:54 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ సినిమా షూటింగ్ మొదలైపోయింది. తారక్ లేకుండా, ఇతర ఆర్టిస్టులపై కొన్ని సీన్లు తెరకెక్కించే పనిలో బాబీ నిమగ్నమయ్యారు. జై లవ కుశ అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరవనున్నసంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీపై కొన్ని రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. తమిళంలో అజిత్ చేసిన ‘వరలారు’ అనే సినిమా స్టోరీని బాబీ కథ పోలి  ఉంటుందని రూమర్ చక్కర్లు కొట్టింది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అజిత్ మూడు పాత్రలను పోషించాడు. 2006లో వచ్చిన ఈ సినిమా ఆర్ధికంగా విజయం సాధించడమే కాదు.. అజిత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

కావున ఎన్టీఆర్ ఈ కథను సెలక్ట్ చేసుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలను బాబీ బృందం ఈ రోజు ఖండించింది. ఇది ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని  ప్రత్యేకంగా రాసిన స్టోరీ అని, ‘వరలారు’ కి ఈ చిత్రానికి అసలు సంబంధమే లేదని స్పష్టం చేసింది. తన లుక్స్ పై పూర్తి క్లారిటీ వచ్చిన అనంతరం  షూటింగ్ లో పాల్గొనాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు.  మార్చి 10 నుంచి చిత్రీకరణలో తారక్ జాయిన్ అవుతారని సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus