బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ..!

  • March 20, 2018 / 12:19 PM IST

సంక్రాంతి బరిలో జై సింహాగా సత్తా చాటిన నందమూరి బాలకృష్ణ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ గా బాలయ్యే నటిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.ఎన్టీఆర్ జీవితాన్ని సమగ్రంగా చూపిస్తామని ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీయార్ సతీమణిగా విద్యాబాలన్ నటించనుందని తెలుస్తోంది.

ఆల్రెడీ తేజ ఆమెకు కథ చెప్పడం, ఆమె కోరిన భారీ రెమ్యూనరేషన్ ను సినిమాకి నిర్మాత కూడా అయిన బాలయ్య అంగీకరించడం జరిగిపోయాయట. ఇదివరకు కత్రినా కైఫ్, రాధికా ఆప్టే, శిల్పా శెట్టి, అమీషా పటేల్, సోనాల్ చౌహాన్ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో నటించిన బాలకృష్ణ ఇప్పుడు విద్యాబాలన్ తో నటించనుండడం సాధారణంగానే ఆసక్తికర విషయంగా మారింది. ఇక విద్యాబాలన్ రాకతో “ఎన్టీయార్” బయోపిక్ ను హిందీలోనూ విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్ధమవుతున్నది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus