చరణ్ తో స్టెప్పులెయ్యడానికి రెడీ అయిన బాలీవుడ్ బ్యూటీ

  • December 13, 2018 / 09:18 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ – బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఒక్క పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. మాస్ డైరెక్టర్ బోయపాటి చిత్రంలో ఐటెం సాంగ్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రంలో కూడా ఐటెం సాంగ్ ఉందట. డిసెంబర్ 14 నుండీ ఈ ఐటెమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారట. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఐటెం సాంగ్ కోసం ప్రత్యేకంగా ‘పబ్’ సెట్ కూడా వేసినట్టు సమాచారం.

మొదట ఈ సాంగ్ కు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ను సంప్రదించారట. కానీ వారి డేట్స్ బిజీగా ఉండటంతో కేథరిన్ ను తీసుకున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో పేరు వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామ ఈషా గుప్తా ను ఖరారు చేసినట్టు సమాచారం. డీ.వీ.వీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డీ.వీ.వీ.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus